Pages

Saturday, April 26, 2014

ఋషిపీఠం కార్యక్రమం

ఋషిపీఠం కార్యక్రమం


‘దేశమంతా ఒకే ప్రజ’ అనే భావంతో, కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విడదీసి చూడకుండా, సమగ్ర దేశాభివృద్ధికి కృషి చేసే పాలన కోసం మనం ఎదురుచూస్తున్నాము  
అలా దేశ క్షేమం కోరుకునే వారంతా సెక్యులరిజం ముసుగులో ఉన్న అసుర వర్గాలని గుర్తించాలి ..
నిజమైన అభ్యుదయాన్ని, సమగ్ర దేశప్రగతిని కాంక్షించేవారిని, అవినీతిలేని వారిని ఎంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన తరుణం.

సర్వదేశ పౌరుల క్షేమంకోసం, మొత్తంగా ఈ దేశం అన్ని రంగాల్లోనూ అభ్యున్నతి సాధించడంకోసం… అవినీతి రహిత సుస్థిర పాలనకోసం సంకల్పించి
ఋషిపీఠం రాజమహేంద్రవర శాఖ ఒక సత్కార్యం తలపెట్టింది.

అసుర శక్తుల్ని దునుమాడి, త్యాగశీలురైన నాయకులు ఎన్నిక కావాలని,  
స్వార్థప్రయోజనాలును విస్మరించి, దేశాభ్యున్నతికి కృషిచేసే ఆదర్శభారత ప్రభుత్వం ఏర్పడాలని ..
అలాంటి నాయకత్వానికి సమర్థిస్తూ ఓటు వేసే సద్బుద్ధి ఓటర్లందరికీ కలగాలని
ఆదిశక్తిని .. కోరుకుంటూ .. భగవంతుని ప్రార్థిస్తూ…

చైత్ర మాసంలో మాస శివరాత్రి పుణ్య దినాన
గణపతి హోమం, చండీ హోమం, సుదర్శన హోమం..శివాభిషేకం.. చేయనున్నది ఋషిపీఠం …
27 ఏప్రిల్, 2014 ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభించి సుమారు 3 గంటలపాటు జరిగే ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొనవచ్చు..
రాజమండ్రి దానవాయిపేట చిన్నగాంధీ బొమ్మ వీధిలో రామచంద్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్, రాజమహేంద్రవర శాఖ కార్యాలయ ప్రాంగణంలో వేదపండితుల నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

మన మనస్సులు 
మంచిగా ఆలోచించాలి… 

దేశ సంస్కృతిని .. ధర్మాన్ని రక్షించే 
మంచి మనస్సుగల నాయకులు మనకు రావాలి

మన రాష్ట్రం 
దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా రూపు దిద్దుకోవాలి, ,

మన భారత దేశం 
పూర్వ వైభవాన్ని సముపార్జించుకుని ప్రపంచంలోనే అగ్రదేశంగా భాసించాలి  ..

…. మీ అందరికీ శుభాహ్వానం



1 comment: